స్టాక్మార్కెట్ల లాభాల సెంచరీ
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీసీ నష్టాలతో మంగళవారం భారీగా నష్టపోయిన సూచీలు ఈరోజు ఆరంభంలో సానుకూలంగా మారాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 110 పాయింట్లు ఎగిసి 31816వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 9859 వద్ద కొనసాగుతున్నాయి.
దాదాపు అన్ని రంగాలూ లాభాలతో ఉన్నాయి. ప్రధానంగామిడ్క్యాప్ బ్యాంకింగ్ సెక్టార్, ఫార్మా లాభాల్లో, ఐటీ నష్టాల్లో ఉంది. అరబిందో ఫార్మా, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్ తదితర పీఎస్యూ బ్యాంక్ షేర్లు, ఐటీసీ, లుపిన్, ఐషర్ లాభాల్లో, హెచ్యూఎల్, అల్ట్రాటెక్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, టాటా మోటార్స్నష్టాల్లో ఉన్నాయి.
మరిన్ని వార్తలు