సిరీస్‌ చివరలో మెరుపులు

Sensex And Nifty Closes Highe - Sakshi

సాక్షి, ముంబై: డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపులో దలాల్‌ స్ట్రీట్‌ మెరుపులు మెరిపించింది. ఆరంభంనుంచి పటిష్టంగా ఉన్న సూచీలు మరింత స్థిరంగా ముగిసాయి. ఒక దశలో 700 పాయింట్ల మేర దసుకు వెళ్లింది. చివరికి సెన్సెక్స్‌ 665 పాయింట్లు  లాభంతో  36,257 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల ఎగిసి 10,831 వద్ద స్థిరపడింది.  రెండూ కీలక మద్దతు స్థాయిలక పైన ముగియడం విశేషం. అలాగే నిఫ్టీ బ్యాంకు కూడా భారీగా పుంజుకుంది. కాగా ఫెడ్ ప్రకటనతో ఊపందుకున్న విదేశీమార్కెట్లకు తోడు దేశీయంగా రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న యూనియన్‌ బడ్జెట్‌పై అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. మరోవైపు జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడం కూడా ఇండెక్సులకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

మీడియా తప్ప అన్ని రంగాల్లో ఉత్సాహంగానే ముగిసాయి. ముఖ్యంగా  యాక్సిస్‌, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, టైటన్‌, టాటా మోటార్స్‌,  కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో, ఆర్‌ఐఎల్‌, యూపీఎల్‌  టాప్‌ విన్నర్స్‌గా ఉండగా, యస్‌ బ్యాంక్‌, జీ, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐబీ హౌసింగ్‌, గ్రాసిమ్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌  నష్టపోయాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top