ఎస్బీఐ బల్క్ డిపాజిట్లపై వడ్డీ పెంపు!
75 నుంచి 140 బేసిస్ పాయింట్ల పెరుగుదల
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.కోటి పైబడిన బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటును మంగళవారం పెంచింది. 75 నుంచి 140 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర పెంచామని, తక్షణం ఈ పెంపు అమల్లోకి వస్తుందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది నవంబర్లో కూడా ఎస్బీఐ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నెల్లో కోటి, ఆపైబడిన డిపాజిట్లపై వడ్డీరేటును ఒక శాతం పెంచింది.
♦ తాజా మార్పులతో స్వల్పకాల బల్క్ డిపాజిట్ (46–179 రోజులు అలాగే 180– 210 రోజులు) రేటు 4.85 నుంచి 6.25 శాతానికి చేరింది.
♦ ఏడాది నుంచి రెండేళ్ల రేటు 5.25 శాతం నుంచి 6.25 శాతానికి పెరుగుతుంది.
♦ రెండు నుంచి పదేళ్ల కాలానికి డిపాజిట్ రేటు 5.25 శాతం నుంచి 6 శాతానికి పెరుగుతుంది.