బడ్జెట్‌ ధరలో శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌

Samsung Galaxy J2 (2017) smartphone with 4G VoLTE launched at Rs 7,390 - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్‌ ఇండియా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.  తన గెలాక్సీ  సిరీస్‌లో జె2   (2017) స్మార్ట్‌ఫోన్‌4జీ వోల్ట్‌,  ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ మద్దతుతో బడ్జెట్‌ ధరలో దీన్ని ప్రారంభించింది. గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్న ఈ డివైస్‌ ధరను రూ .7,390గా నిర్ణయించింది.  దేశీయంగా ఆన్‌లైన్‌,  ఆఫ్‌లైన్‌ స్టోర్లలో దీన్ని విక్రయిస్తోంది.  షావోమి రెడ్‌మి 4,   నోకియా 5 కు పోటీగా దీన్ని మార్కెట్‌లో  దీన్ని  ప్రవేశపెట్టింది.

శాంసంగ్ గెలాక్సీ జె2 (2017)  ఫీచర్లు
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్‌  డిస్‌ప్లే
540x960 పిక్సల్స్ రిజల్యూషన్‌  
 ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 1.3GHz క్వాడ్-కోర్ ఎక్వైనోస్ ప్రాసెసర్
1జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్
128 జీబీదాకా విస్తరించుకునే సదుపాయం.
 5ఎంపీ  వెనుక కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్
 2ఎంపీ  సెల్ఫీకెమెరా
 2000 ఎంఏహెచ్‌ రిమూవబుల్ బ్యాటరీ
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top