మూడు నెలల కనిష్టానికి రూపాయి

Rupee sheds 15 paise against US dollar - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం మరింత బలహీనపడింది. డాలర్‌మారకంలో 15పైసలు క్షీణించిన రూపాయి 68.16  వద్ద ఉంది. దీంతో తాజాగా మూడు వారాల కనిష్టాన్ని తాకింది.  అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒత్తిళ్ల ప్రభావం,  డాలర్‌  ఏడువారాల గరిష్టానికి చేరడంతో రూపాయిలో అమ్మకాలు కొనసాగుతున్నట్టు  డీలర్లు చెబుతున్నారు. శుక్రవారం  డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కీలక 68 పాయింట్ల దిగువన 68.01 వద్ద ముగిసింది . అటు  ఈక్విటీ మార్కెట్లుకూడా ఫ్లాట్‌గా   ప్రారంభమైనాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న ధోరణి కనిపిస్తోంది.

మే నెలలో వాణిజ్య లోటు దాదాపు 15 బిలియన్‌ డాలర్లతో  4 నెలల కనిష్టంకాగా.. ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలు(శుక్రవారం విదేశీ సంస్థాగత మదుపరులు రూ .1,524.74 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు) దెబ్బతీసినట్టు  విశ్లేషకుల అంచనా. మరోవైపు  గత వారం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ పెంపు చేపట్టడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు దాదాపు 95కు ఎగసింది. ఇది 7 నెలల గరిష్టం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top