ఎగ్జిట్ పోల్స్: రుపాయి జూమ్
సాక్షి,ముంబై: దేశీయకరెన్సీ రూపాయి డాలర్ మారకంలో శుక్రవారం భారీగా లాభపడింది. ఆరంభంలో 23పైసలు జంప్ చేసి మూడు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. గురువారం నాడు 64.34వద్ద ముగియగా ప్రస్తుతం 21 పైసలు లాభంతో రూ. 64.11వద్ద ట్రేడ్ అవుతోంది.
ముఖ్యంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపొందనుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో సెంటిమెంట్ బలపడింది. దీంతో డాలర్ మారకంలో రూపాయి బాగా పుంజుకుంది.అటు ఎగ్జిట్ పోల్ అంచనాలను అందుకున్న ఈక్విటీ మారట్లు కూడా భారీ లాభాల్ కొనసాగుతున్నాయి.