త్వరలో రూ.20 కొత్త నోటు

RBI to Issue New Rs 20 Notes Soon - Sakshi

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. మహాత్మా గాంధీ సిరీస్‌లో ఉండే ఈ నోట్లు.. ఆకుపచ్చ, పసుపు కలిసిన రంగులో ఉన్నాయి. ఈ నోటు నమూనాను ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఈ నమూన ప్రకారం ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంది. అలాగే అశోకుడి స్థూపం కూడా ఉంది. ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్‌ లోగో, నినాదం ఉన్నాయి. ఈ నోటు సైజు 63 mm x 129 mm గా ఉండనుంది. కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.10, రూ.100 విలువచేసే కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top