కుదేలవుతున్న స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 198 పాయింట్లు కోల్పోయి 31,724 వద్ద, నిఫ్టీ70 పాయింట్ల నష్టంతో 9894 వద్ద 9900 స్తాయిని కోల్పోయింది. ఆరంభంనుంచే అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. మిడ్క్యాప్,స్మాల్కాప్సెక్టార్లు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి.ముఖ్యంగా ఫార్మ, బ్యాంక్ నిఫ్టీ నష్టాలను లీడ్ చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తగా ఉండాలని ఎనలిస్టులు సూచించారు.
దాదాపు అన్ని బ్యాంకింగ్ , ఫార్మ, షేర్లతోపాటు, అదానీ, ఆసియన్ పెయింట్స్ , బీపీసీఎల్, అల్ట్రాటెక్, ఐవోసీ, నష్టపోయాయి. టాటా పవర్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టీసీఎస్, వేదాంతా, ఐసీఐసీఐ, ఐటీసీ స్వల్పంగా లాభపడుతోంది.
మరిన్ని వార్తలు