ఓలా చేతికి ఫుడ్‌పాండా ఇండియా!

 ola over  food fanda take  - Sakshi

న్యూఢిల్లీ:  ఆన్‌లైన్‌ ఆహార పదార్థాల సరఫరా కంపెనీ ఫుడ్‌ పాండా భారత కార్యకలాపాలను క్యాబ్‌ సర్వీసుల సంస్థ ఓలా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ మొత్తం షేర్ల రూపంలోనే జరిగినట్లు ఓలా తెలిపింది. జర్మనీకి చెందిన డెలివరీ హీరో నుంచి ఫుడ్‌పాండా భారత కార్యకలాపాలను కొనుగోలు చేసినట్లు ఓలా తెలియజేసింది.

ఫుడ్‌పాండా భారత కార్యకలాపాల కోసం రూ.1,280 కోట్లు (20 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టనున్నామని తెలియజేసింది. ఓలా పోటీ కంపెనీ ఉబర్‌ ఇటీవలే తన మీల్‌ ఆర్డర్‌ అండ్‌ డెలివరీ ప్లాట్‌ఫార్మ్‌ ఉబర్‌ ఈట్స్‌ను మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఓలా ఫుడ్‌ పాండాను కొనుగోలు చేసింది. తీవ్రమైన పోటీ నెలకొన్న ఆహార పదార్థాల డెలివరీ రంగంలో స్విగ్గి, జొమాటొ వంటి సంస్థలు కాస్త ముందంజలో ఉన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top