ఆద్యంతం ఒత్తిడి: కీలక స్థాయిల దిగువకు సూచీలు
సాక్షి, ముంబై: తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన దేశీయ స్టాక్మార్కెట్లు భారీనష్టాలతో ముగిశాయి. ఆరంభంనుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడినమార్కెట్లలో మిడ్ సెషన్ తరువాత అమ్మకాల జోరు పెరిగింది. దాదాపుఅన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్219 పాయింట్లు పతనమై 35,470కు చేరగా.. నిఫ్టీ 59పాయింట్లు క్షీణించి 10,762 వద్ద ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 35, 500 స్థాయిని, నిఫ్టీ 10800ని కోల్పోయింది. ఒ క్క ఐటీ స్వల్పంగా లాభపడింది. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకింగ్ షేర్లు ఆటో రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. టాటా మోటార్స్, యాక్సిస్, ఎస్ బ్యాంక్ రిలయన్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. హెచ్పీసీఎల్, ఐసీఐసీఐ, బీపీసీఎల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, ఐవోసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఐడీబీఐ భారీగా నష్టపోయాయి. అటు అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, సన్ఫార్మ, టెక్ మహీంద్ర, ఆషియన్ పెయింట్స్ ఎల్ అండ్టీ భారీగాను, బజాజ్ ఫైనాన్స్, ఐషర్, ఇన్ఫ్రాటెల్, వేదాంతా, హెచ్యూఎల్, లుపిన్, గెయిల్, బజాజ్ ఫిన్ లాభపడ్డాయి. మరోవైపు పసిడి ధరలు వరుసగా లాభపడుతున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా. 92 రూపాయిలు ఎగిసిన బంగారం 30,702 వద్ద ఉంది.