పారీవేర్ నుంచి నూతన శ్రేణి బాత్రూమ్ ఉత్పత్తులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బాత్రూమ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ పారీవేర్ విపణిలోకి నూతన శ్రేణి ఉత్పత్తులను విడుదల చేసింది. థర్మోస్టిక్, ఓవర్హెడ్, రెయిన్ షవర్స్, బాడీ జెట్స్, మల్టీజెట్ పేరిట విడుదల చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
సహజసిద్ధమైన వానల వల్ల ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆయా ఉత్పత్తుల నుంచి జాలువారే నీళ్లు కూడా అంతే అనుభూతిని కలిగిస్తాయని రోకా బాత్రూమ్ ప్రొడక్ట్స్ ఎండీ కేఈ రంగనాథన్ తెలిపారు. వీటిని స్టెయిన్ లెస్ స్టీల్, గ్లాస్తో రూపొందించినట్లు పేర్కొన్నారు. ధరల శ్రేణి రూ.13 వేల నుంచి ప్రారంభమవుతాయి. రోకా ఇండియా బ్రాండే ఈ పారీవేర్.