లాభాల ప్రారంభం : అమ్మకాల ఒత్తిడి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లుభారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ కేవలం నిమిషాల వ్యవధిలోనే అమ్మకాల ఒత్తిడితో ప్రారంభ లాభాలనుంచి ఫ్లాట్గా మారాయి. 150పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 71 పాయింట్ల లాభానికి పరిమితమై 38714వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో 11688 వద్ద కొనసాగుతోంది. ఐటీ ఫార్మ, లాభాల్లో ఉండగా, బ్యాంకింగ్ సెక్టార్ నష్టపోతోంది. అలాగే వర్షాలు వరదల కారణంగా వాహనాల అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో మారుతి నష్టపోతోంది. ఐసీఐసీఐ, రిలయన్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. విప్రో, లుపిన్, డా.రెడ్డీస్, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్ ,ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, అంబుజా సిమెంట్ లాభపడుతున్నాయి.
మరిన్ని వార్తలు