స్టాక్‌మార్కెట్ల లాభాల ప్రారంభం


సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  మెటల్‌, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ,  ఆటో,  ఫార్మా  సెక్టార్లు లాభాలను ఆర్జిస్తున్నాయి.  దీంతో వరుసగా రెండో  రోజు కూడా కీలక  సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 80 పాయింట్ల లాభంతో 31,742 వద్ద, నిఫ్టీ 28పాయింట్లు ఎగిసి 9958  వద్ద కొనసాగుతున్నాయి.  మార్కెట్‌  ప్రారంభంలోనే ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,950ను అధిగమించింది.   


హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ లాంటి బ్యాంకింగ్‌ షేర్లు,  ఐషర్‌ మోటార్స్‌, టాటా స్టీల్‌, అంబుజా సిమెంట్స్‌,  అదాని, ఎల్‌ అండ్‌ టీ  పీజీ జ్యుయల్లరీ లాభపడుతుండగా, గ్లెన్‌మార్క్‌, బయోకాన్‌, దివీస్‌  తోపాటు ఇతర ఫార్మా పాజిటివ్‌గా ఉన్నాయి. సుగర్‌ షేర్లు, జెపీ అసోసియట్‌ , ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ , బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, ఐవోసీ, హెచ్‌యూఎల్‌ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top