లాభాల్లో మార్కెట్లు, టెలికాం షేర్లు జూమ్
సాక్షి, ముంబై : ప్రపంచ మార్కెట్ల పాజిటివ్ సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 108 పాయింట్లు ఎగిసి వద్ద, నిఫ్టీ పాయింట్ల 28 లాభంతో వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 40450కి ఎగువన, నిఫ్టీ 11900కి ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా టెలికాం , బ్యాంకింగ్, ఫార్మా రంగ షేర్లు లాభపడుతున్నాయి. మెటల్ షేర్లు నష్టపోతున్నాయి. యస్ బ్యాంకు మరోసారి నష్టాల్లోకి మళ్లింది. వరుసగా రెండో సెషన్లో కూడా బలహీనంగా కొనసాగుతోంది. జీ, టీసీఎస్, బజాజ్ నష్టపోతున్నాయి.
అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ నష్టాలతో ట్రేడింగ్ను ఆరంభించింది. 71.95 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని వార్తలు