నష్టాల్లోకి స్టాక్మార్కెట్లు: బ్యాంకులు డౌన్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ , నిఫ్టీ రెండూ స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. అనంతరం మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన రీకాపిటలైజేషన్తోబ్యాంకింగ్ రంగంలోభారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సెన్సెక్స్ 70పాయింట్లు కోల్పోయి 36,091వద్ద, నిఫ్టీ 15పాయింట్లు నష్టంతో 10,071వద్ద కొనసాగుతోంది. పీసీయూ బ్యాంక్ సెక్టార్, ఐటీ, టెలికాం సెక్టార్లు నష్టపోతున్నాయి. ఫార్మా, మెటల్ సెక్టార్ రీబౌండ్ అయింది. మరోవైపు ఈ రోజు ఎఫ్ అండ్ వో సిరీస్కు చివరి రోజు.
ఎస్బీఐ 3శాతం, పీఎన్బీ, ఓబీసీ, విజయా బ్యాంక్,అలహాబాద్, ఆంధ్రా బ్యాంకు, బీఓబీ నష్టపోతుండగా,రీకాపిటలైజేషన్ జోష్తో కెనరాబ్యాంక్, ఐడీబీఐ , దెనా, యూకో బ్యాంకులు లాభపడుతున్నాయి. అలాగే హిందాల్కో, వేదాంతా, హిందుస్తాన్ జింక్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్,ఫార్మా, సిప్లా, డా.రెడ్డీస్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. భారతి ఎయిర్టెల్, ఐడియా వరుసగా రెండోరోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.