ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ప్రారంభంనుంచి అప్రమత్తంగా ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ చివరికి ఫ్లాట్ నోట్తో ముగిశాయి. సెన్సెక్స్ 21పాయింట్ల నష్టంతో 32402 వద్ద, 5 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 10147 దగ్గర ముగిసింది. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు వరుసగా 8 సెషన్ల లాభాల నుంచి మార్కెట్లు వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా ఆరంభంలోనే కొత్త గరిష్టాలను తాకి రికార్డులు నమోదు చేసిన నిఫ్టీ ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది.
దాదాపు అన్ని సెక్టార్లు స్వల్పంగా నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్, మెటల్స్ రంగాలు నష్టపోగా, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు పాజిటివ్గా ముగిశాయి. గెయిల్, టాటా మోటార్స్, దివీస్ పీఎఫ్సీ, టాటా కెమికల్స్, డాబర్ ఇండియాటాప్ విన్నర్స్గా నిలిచాయి. కోల్, అరబిందో, రిలయన్స్, సుందరం ఫైనాన్స్, ఇండిగో ఎయిర్లైన్స్ నష్టపోయినవాటిల్లో ఉన్నాయి.
మరోవైపు ఫెడ్ రెగ్యులేటరీ రెండు రోజుల సమావేశం ఈ రోజు ప్రారంభం కానుంది. రేట్ కట్ పైనే ఎక్కువ మంది నిపుణులు అంచనాలు వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు