కేంద్రానికి ఎల్ఐసీ రూ.2,207 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి శుక్రవారం రూ.2,207 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. మిగులులో 95 శాతాన్ని పాలసీ హోల్డర్లకు బోనస్గా చెల్లించిన అనంతరం మిగిలిన ఐదు శాతాన్ని కేంద్రానికి డివిడెండ్గా అందజేసినట్లు ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటనలో ఎల్ఐసీ తెలిపింది. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీకి ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ ఈ చెక్కును అందజేసినట్లు కూడా ప్రకటనలో వివరించింది.
మరిన్ని వార్తలు