ఫలితాలు కీలకం..
ముడి చమురు ధరల గమనం
ఇరాన్పై అమెరికా ఆంక్షలు
ఈ వారం మార్కెట్కు కీలకాంశాలు
కీలక కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్తో రూపాయి మారకం కదలికలు ఈ వారం మార్కెట్కు కీలకమని నిపుణులంటున్నారు. ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా ఉత్పన్నమయ్యే ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్పై ఉండొచ్చని వారంటున్నారు.
200 కంపెనీల ఫలితాలు..
ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిందాల్ స్టీల్ అండ్ పవర్ వంటి దాదాపు 200 కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారంలో వస్తాయి. మార్చి పారిశ్రామికోత్పత్తి, ఏప్రిల్ రిటైల్ వ్యోల్బణ గణాంకాలు శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడతాయి.
ఒడిదుడుకులు కొనసాగుతాయ్..
విదేశీ నిధులు తరలిపోవడం ఆందోళన కలిగించే విషయమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ వారం కూడా ఒడిదుడుకులు కొనసాగుతాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) టీనా వీర్మాణి చెప్పారు.
9 నుంచి ఇండోస్టార్ క్యాపిటల్ ఐపీఓ
ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 9 నుంచి ఆరంభమై 11న ముగుస్తుంది. ఈ ఐపీఓకు ప్రైస్బాండ్గా రూ.570–572ను కంపెనీ నిర్ణయించింది.
మరిన్ని వార్తలు