జియో రీచార్జ్‌: 100% క్యాష్‌బ్యాక్‌

Jio Rs. 399 Pack Now With 100 Percent Cashback: Details and All the Fineprint

ముంబై : కస్టమర్లకు రిలయన్స్‌ జియో దీపావళి ధనాధన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. క్యాష్‌బ్యాక్‌ను తదుపరి రీచార్జ్‌ చేసుకునే సమయంలో వినియోగించుకోవచ్చని వెల్లడించింది.

రూ. 399తో రీచార్జ్‌ చేసుకునే వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఏదో ఒక ప్యాక్‌లో ఉన్న వినియోగదారులు ఈ ఆఫర్‌ రీచార్జ్‌ను చేసుకోవడం వల్ల పాత ప్యాక్‌ పూర్తైన తర్వాత ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.

క్యాష్‌బ్యాక్‌ ఇలా..
రూ.399తో రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారలకు వోచర్ల రూపంలో క్యాష్‌బ్యాక్‌ అందుతుందని చెప్పింది. ఈ నెల 12 నుంచి 18 వరకూ ఆఫర్‌ అమలులో ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే జియో ప్రైమ్‌ కస్టమర్లుగా ఉన్న వారికి ఎనిమిది వోచర్లు(రూ.50) క్యాష్‌బ్యాక్‌ రూపంలో వస్తాయని చెప్పింది.

వీటిని రూ. 309 లేదా అంతకంటే ఎక్కువ విలువజేసే ఆఫర్లను కొనుగోలు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు లేదా రూ.91 ఆపై విలువజేసే డేటా ఆడ్‌ ఆన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. అయితే, క్యాష్‌బ్యాక్‌ వచ్చిన మొత్తాన్ని నవంబర్‌ 15 తర్వాతే వినియోగించడానికి వీలు కలుగుతుంది.

రూ.399 ప్యాక్‌ వివరాలు
ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులకు ఒకే రకమైన సదుపాయాలను ఈ ప్యాక్‌ కల్పిస్తుంది.
84 జీడీ డేటా(84 రోజులు)
ఫ్రీ ఎస్‌ఎంఎస్‌, కాల్స్‌
సబ్‌క్రిప్షన్‌ టూ జియో యాప్స్‌
84 రోజుల వ్యాలిడిటీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top