స్వల్ప లాభాలు : సన్ఫార్మ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్పలాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 65పాయింట్ల లాభంతో 36,440 వద్ద, నిఫ్టీ14పాయింట్ల లాభంతో 10,919 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సన్ఫార్మ భారీగా నష్టపోతోంది. ఇంకా యాక్సిస్, ఇన్ఫోసిస్, జెట్ ఎయిర్వేస్, టెక్మహీంద్ర, ఎయిర్టెల్, జెట్ ఎయిర్వేస్, జీ, హెచ్సీఎల్ నష్టపోతుండగా, బంపర్ లాభాలను ప్రకటించిన రిలయన్స్ టాప్ విన్నర్స్గా ఉంది. ఇంకా ఎన్టీపీసీ, వేదాంతా, ఐవోసీ, ఎస్బ్యాంకు,ఎస్బీఐ , భారతి ఇన్ఫ్రాటెల్ లాభపడుతున్నాయి. మరోవైపు రానున్న ఆర్థిక బడ్జెట్ నేపథ్యంలో రైల్వే షేర్లు లాభపడుతున్నాయి.
అటు డాలరు మారకంలో రుపీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. నిన్నటి ముగింపు 71.07తో పోలిస్తే 71.05వద్ద మొదలైంది.