నేడు స్టాక్ మార్కెట్కు సెలవు
ముంబై : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్కు సెలవును పాటిస్తున్నాయి. బులియన్, లోహ, అన్ని టోకు ధరల కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. కాగ, మంగళవారం ద్రవ్యోల్బణ గణాంకాలు జోష్నివ్వడంతో రెండో రోజుల నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి.
సెన్సెక్స్ 207 పాయింట్లు లాభపడి 37,852 పాయింట్ల వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు పెరిగి 11,435 పాయింట్ల వద్ద ముగిశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల కనిష్ట స్థాయి, 4.17 శాతానికి పడిపోగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 5.09 శాతానికి తగ్గింది.
మరిన్ని వార్తలు