మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల హవా...
ముంబై: స్టాక్మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల కాలంలో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో రూ.13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీలను వెనక్కి తీసుకున్నా, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టడం విశేషం. గత సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్ పెట్టిన పెట్టుబడుల మొత్తం రూ.70,716 కోట్లు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం మందకొడిగా ఉండడంతో ఈ సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్ అధిక నిధులు ఆకర్షించగలుగుతాయని అంచనా.