భగ్గుమన్న బంగారం
ముంబై : గత కొద్దిరోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ మెరుపులతో పాటు డాలర్తో రూపాయి మారకం విలువ బలహీనపడటంతో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఎంసీఎక్స్లో మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 183 భారమై రూ 40,939కి ఎగబాకింది. ఈ ఏడాది బంగారం ధరలు పదిగ్రాములకు రూ 50,000కు చేరువ కావచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక వెండి ధరా మండిపోతోంది. కిలో వెండి ఏకంగా రూ 222 భారమై రూ 46,345కి చేరింది.
మరిన్ని వార్తలు