ఫ్లిప్కార్ట్ ఫోన్ లాంచ్: క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ రీటైల్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రకటించిన ఫ్లిప్కార్ట్ ‘బిలియన్ క్యాప్చర్ ప్లస్’ పేరుతో బుధవారం ఈ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో విడుదల చేసింది . 3జీబీ/ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ ఫోన్ విడుదలైంది. 3జీబీర్యామ్/32జీబీ స్టోరేజ్ ధర రూ.10,999గాను, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. ఆండ్రాయిడ్ 7.1.2 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించిన ఈ డివైస్లకు త్వరలోనే ఓరియోతో అపడేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
అంతేకాదు క్యాష్ బ్యాక్ ఆఫర్ను కూడా అందిస్తోంది. ఫ్లిప్కార్ట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఈ బిలియన్ క్యాప్చర్ ప్లస్ను కొనుగోలు చేసిన కస్టమర్లకు 10శాతం క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
బిలియన్ క్యాప్చర్ ప్లస్ ఫీచర్లు
5.5 అంగుళాల డిస్ప్లే
ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2
625 అక్టాకోర్ స్నాప్డ్రాగన్ ప్రొసెసర్
3జీబీ, 4జీబీ ర్యామ్
13+13 ఎంపీ రియర్ కెమెరాలు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ