స్టాక్‌మార్కెట్లు వెయిట్‌ అండ్‌ సీ ధోరణి

election counitng... Wait and see trend in stockmarkets - Sakshi

సాక్షి, ముంబై: ఒకవైపు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు...మరోవైపు ఫలితాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టాక్‌మార్కెట్లు.  ఈ నేపథ్యంలో ప్రీ  ఓపెన్‌లో  వెయిట్‌వాచ్‌ ధోరణిలో  అప్రమత్తంగా ప్రారంభమయ్యాయి.

మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ  దూసుకుపోతోంది.  ఎగ్జిట్‌ పోల్‌  అంచనాలను అందిపుచ్చుకున్న మార్కెట్లు శుక్రవారం భారీ  లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 10,364-10,395 స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని సాంకేతిక నిపుణులు అంచనా.  అయితే 10,311-10,289 పాయింట్ల దగ్గర మద్దతు లభించే అవకాశంఉందని విశ్లేషిస్తున్నారు.

అయితే అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో శుక్రవారం రూ. 921 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే మరోవైపు దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 635 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయడం గమనార్హం.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top