బుల్ రన్ : సెన్సెక్స్ డబుల్ సెంచరీ
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ బుల్ రన్ ప్రారంభమైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్ డబుల్ సెంచరీని బీట్ చేసింది. నిఫ్టీ 11,400 పైకి జంప్ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంలో 37,883 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంలో 11,443 వద్ద ట్రేడవుతున్నాయి. అన్ని స్టాక్స్ కూడా గ్రీన్గానే లాభాల పంట పండిస్తున్నాయి. బ్యాంక్లు, మెటల్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి.
ఫార్మా, ఇన్ఫ్రా, ఆటో, ఎనర్జీ సూచీలూ బుల్ రన్లో పరుగెడుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో టాప్ గెయినర్లుగా వేదంత, టాటా మోటార్స్, హిందాల్కోలు నిలువగా.. భారతీ ఎయిర్టెల్, విప్రో, హెచ్డీఎఫ్సీ లు ఎక్కువగా నష్టపోయాయి.
మరిన్ని వార్తలు