మంచి శకునాలతో మార్కెట్‌లో జోష్‌..

bulls strengthened their hold on Dalal Street on Tuesday - Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్ల మద్దతుతో పాటు సెప్టెంబర్‌ త్రైమాసంలో అంచనాలకు మించిన కార్పొరేట్‌ ఫలితాలతో దలాల్‌ స్ట్రీట్‌లో జోష్‌ నెలకొంది. మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రోత్సహించేలా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటిస్తుందనే వార్తలు సైతం ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. మదుపుదారులు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లకు దిగడంతో సూచీలన్నీ పరుగులు పెట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 581 పాయింట్ల లాభంతో 39,831 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 159 పాయింట్లు ఎగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,786 పాయింట్ల వద్ద క్లోజయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top