బీఎండబ్ల్యూ కొత్త ‘గ్రాన్ టురిస్మో ఎం స్పోర్ట్’
ధర రూ. 49.4 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా ‘330ఐ గ్రాన్ టురిస్మో ఎం స్పోర్ట్’లో కొత్త అప్డేటెడ్ వెర్షన్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.49.4 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ఇండియా) ఉంది. స్పోర్టింగ్ లుక్, ఆకట్టుకునే పనితీరు, అదిరిపోయే డిజైన్తో కూడిన ఈ కొత్త వెర్షన్ కస్టమర్కు ప్రతి ప్రయాణాన్నీ మరచిపోలేని అనుభూతిగా మిగులుస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు.
8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన 2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు కేవలం 6.1 సెకన్లలోనే 0–100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, బ్రేక్ అసిస్ట్తో కూడిన యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డీఎస్సీ), డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (డీటీసీ), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సీబీసీ), సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, క్రాష్ సెన్సార్, రన్ఫ్లాట్ టైర్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు.