స్టాక్మార్కెట్ల లాభాల బాట..
ముంబై : స్టాక్మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. శుక్రవారం స్టాక్మార్కెట్లు ఒడిదుడుకులతో ఆరంభమైనా కొనుగోళ్లు ఊపందుకోవడంతో లాభాల బాట పట్టాయి. కరోనా కట్టడికి భారత్ పలు చర్యలు చేపడుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ భరోసా మార్కెట్ సెంటిమెంట్ను కొంతమేర ప్రభావితం చేసింది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 28,458 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 8,333 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.