వరుస లాభాలకు బ్రేక్.. నిఫ్టీ రికార్డ్ క్లోజింగ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. రికార్డ్ స్థాయిలో ప్రాఫిట్ కారణంగా మార్కెట్లు ఆరంభంలోనే వెనకడుగు వేశాయి. దీంతో దలాల్ స్ట్రీట్ లో నాలుగు రోజుల వరుస లాభాలు బ్రేక్ పడింది. అయితే నిఫ్టీ మాత్రం రికార్డ్ స్థాయి వద్ద క్లోజ్ కావడం విశేషం. సెన్సెక్స్24 పాయింట్లు కోల్పోయి 32, 609 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 10,234 వద్ద స్థిరపడ్డాయి.బ్యాంకింగ్, ఆటో, నష్టపోగా, టెలికాం, ఆయిల్ గ్యాస్ సెక్టార్లు లాభాల్లో ముగిశాయి.
ఐడియా, రిలయన్స్ క్యాపిటల్, టాటా కెమికల్స్, యునైటెడ్ స్పిరిట్స్, బజాజ్ ఆటో, ఇండియాబుల్స్ హౌసింగ్, సిప్లా, భారతి ఎయిర్టెల్ లాభపడగా, జీ, కోల్గేట్, టాటా మోటార్స్ నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ భారీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ రంగంలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ టాప్ లూజర్స్గా నిలిచాయి.