ఆపిల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్
సాక్షి, న్యూడిల్లీ: అమెజాన్ ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆపిల్ ఫెస్ట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ సేల్ను అందుబాటులోకి తెచ్చిందది. డిసెంబరు8న ప్రారంభమైన ఈ పండుగ 14న ముగియనుంది. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ సిరీస్ 3, కొత్త మ్యాక్బుక్ ఎయిర్ వంటి ఆపిల్ డివైస్లపై డిస్కౌంట్లను, ఇతర ఆఫర్లను అందిస్తోంది. దీనికి అదనంగా అమెజాన్ వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 5శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్ను పొందగలరు. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో రూ.16వేల వరకు తగ్గింపును అందిస్తోంది.
టాప్ ఆఫర్లు కొన్ని చూద్దాం
ఆపిల్ ఐఫోన్ ఎక్స్: ఐఫోన్ ఎక్స్ 3జీబీ ర్యామ్ 64 జీబీ వేరియంట్ రూ .74,999 లకే లభ్యం. ఎంఆర్పీ ధర రూ.91,900.
256జీబీ వేరియంట్ రూ .89,999 కు లభిస్తుంది. అసలు ధర. 1, 06,900.
ఐఫోన్ 8 64జీబీ వేరియంట్ : ఈ సేల్లో రూ.54,999 కే లభ్యం. అసలుధర రూ. 67,940
ఐఫోన్ 8 ప్లస్: 64జీబీ వేరియంట్ ఈ ఫెస్ట్లో రూ. 64,999. అసలు ధర రూ.77,560
ఐఫోన్ 7 32 జీబీ : అసలు రూ. 39,900 అమెజాన్ సేల్లో 36,999 రూపాయలకు అందుబాటులో ఉంది.
ఆపిల్ మాక్బుక్క్ ఎయిర్: 13.3 అంగుళాల 8 జనరేషన్ రూ. 1,05,900లకే లభ్యం. అసలు ధర రు. 1,14,900.
ఆపిల్ ఎయిర్ పాడ్స్ : ఈ ఫెస్ట్లో వీటి ధరరూ.12,900 నుంచి 11,999 కు తగ్గింది.
వీటితో పాటు మరిన్ని ఆపిల్ డివైస్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. సంబంధిత వివరాలు అమెజాన్ అధికారిక వెబ్సైట్లో.