నిర్మలా సీతారామన్తో వైవీ సుబ్బారెడ్డి భేటీ
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో రక్షణ సంస్థలు నెలకొల్పాలని వినతిపత్రం అందజేశారు. రక్షణ సంస్థలు నెలకొల్పేందుకు అనువుగా ప్రకాశం జిల్లాలో అన్ని సౌకర్యాలున్నాయని నిర్మలా సీతారామన్ దృష్టికి వైవీ సుబ్బారెడ్డి తీసుకువచ్చారు.