నేడు రాష్ట్రపతి వద్దకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు

YSRCP MPs to the President today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మంగళవారం కలవనున్నారు. ఈ మేరకు సోమవారం వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యుల రాజీనామా, అందుకు దారితీసిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించనున్నట్లు పేర్కొన్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా తాము చేసిన పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షలను వివరించనున్నారని తెలిపాయి. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలపనున్నారని, అన్ని అంశాలపై వినతిపత్రం సమర్పించనున్నారని వివరించాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top