చంద్రబాబూ.. డ్రామాలు ఆపి ప్రజల పక్షాన పోరాడు
రైల్వేకోడూరు అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబూ.. ఇకనైనా డ్రామాలు ఆపి నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా డిమాండ్తో మంగళవారం సాయంత్రం సీపీఐ నాయకులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద బిజిలీ బంద్ నిర్వహించారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యే కొరముట్ల, వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు తట్టలు కొడుతూ నిరసన తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పుడు కేవలం దోచుకోవడానికే ప్రత్యేకప్యాకేజీకి ఒప్పుకుని, కేంద్రం హామీలు నెరవెర్చకున్నాచంద్రబాబు నోరు మెదపలేదన్నారు. ప్రత్యేకహోదాను తుంగలో తొక్కి, ఇప్పుడు మళ్లీ డ్రామాలు మొదలెట్టారని విమర్శించారు.
ప్రజల పక్షాన ప్రతి నిత్యం తమ నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకహొదా కోసం పోరాడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు జీ సుధాకర్రాజు, సాయి కిషోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి ఏంపీటీసీ డాక్టర్ సుబ్రమణ్యం, సీపీఐ మండల కార్యదర్శి గంగాపురి సుధాకర్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యడు సిగి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.