ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వండి: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం లేఖ రాసింది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని ఆ పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరారు.
ప్రత్యేక హోదాపై రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్తో పాటు అరుణ్జైట్లీ కూడా హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రణాళిక సంఘం నివేదిక నేపధ్యంలో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన శనివారమిక్కడ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆందోళనను తొలగిస్తూ, భవిష్యత్పై భరోసానిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలంటూ మేకపాటి కోరారు. ఈ మేరకు ఆయన లేఖను మోడీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు.
సంబంధిత వార్తలు