ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ఎంపీలందరూ రాజీనామా చేయాలి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర ఎంపీలందరూ తప్పనిసరిగా రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీటర్లో ట్వీట్ చేశారు. ‘స్వలాభాపేక్ష ఉండాల్సిన సమయం కాదు ఇది.
రాష్ట్ర అభ్యున్నతి కోసం అందరూ గట్టిగా నిలబడాలి. మన హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి చెందిన ప్రతి ఎంపీ రాజీనామా చేయాలి. చంద్రబాబూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలా మీ ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తారా? లేక ఎప్పటిలాగానే ప్రత్యేక ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.