చంద్రబాబు మోసం చేశారు

YS Jagan's promise to lawyers - Sakshi

లాయర్ల అసోసియేషన్‌

న్యాయవాదుల సంక్షే మానికి పలు కార్యక్రమాలు చేపడతానని చెప్పి సీఎం చంద్రబాబు మోసం చేశారని న్యాయవాదుల సంఘం ఆరోపించింది. శొంఠ్యాం రోడ్డులో విశాఖపట్నానికి చెందిన పలువురు న్యాయవాదులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆయనతో కలసి పాదయాత్ర చేశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని కోరు తూ వినతిపత్రం ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని జగన్‌ çహామీ ఇచ్చారని వారు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి న్యాయవాదుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని వారంతా గుర్తు చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top