115వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

YS Jagans PrajaSankalpaYatra Schedule 115th Day - Sakshi

సాక్షి, గుంటూరు: ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 115వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం విరామం ప్రకటించిన పాదయాత్ర సోమవారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో తిరిగి ప్రారంభమవుతుంది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దివారిపాలెం క్రాస్ మీదుగా కొనసాగిన యాత్ర కొమ్మూరుకు చేరుకుంటుంది. 

కొమ్మూరులో మానవహారంలో వైఎస్ జగన్ పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన పాదయాత్ర పెదనందిపాడు శివారుకు చేరుకుంటుంది. పెదనందిపాడులో వైఎస్ జగన్ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. జననేత వైఎస్‌ జగన్‌ ఇప్పటి వరకు 1,528 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. 

మానవహారంలో పాల్గొననున్న వైఎస్ జగన్
విజయవాడ: కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతుగా రేపు (సోమవారం) ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు వద్ద వైఎస్ జగన్ మానవహారంలో పాల్గొననున్నారు. ఈ మానవహారం కార్యక్రమానికి మేధావులు, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పిలుపునిచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top