16వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

YS jagan's day 16 of PrajaSankalpaYatra Begins - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, కర్నూలు : అభిమాన సంద్రం మధ్య ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన తన 16వ రోజు పాదయాత్రను  పత్తికొండ నియోజక నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభించారు. రామల్లెపల్లె నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైఎస్‌ జగన్‌ బోయినపల్లి క్రాస్‌ రోడ్డు చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు రత్నపల్లి క్రాస్‌రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.

భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 5 గంటలకు వెల్దుర్తి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌ బస చేస్తారు. 15వ రోజు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ రెండు వందల కిలోమీటర్ల మార్కును చేరుకున్న విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top