16వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, కర్నూలు : అభిమాన సంద్రం మధ్య ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన తన 16వ రోజు పాదయాత్రను పత్తికొండ నియోజక నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభించారు. రామల్లెపల్లె నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైఎస్ జగన్ బోయినపల్లి క్రాస్ రోడ్డు చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు రత్నపల్లి క్రాస్రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.
భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 5 గంటలకు వెల్దుర్తి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు వైఎస్ జగన్ బస చేస్తారు. 15వ రోజు పాదయాత్రలో వైఎస్ జగన్ రెండు వందల కిలోమీటర్ల మార్కును చేరుకున్న విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు