14వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. 14వ రోజు మంగళవారం డోన్ నియోజకవర్గంలోని బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి షైక్ షా వలీ దర్గాను చేరుకొని డోన్ నియోజకవర్గం పార్టీ నేతలతో ముచ్చటించనున్నారు. అనంతరం పాణ్యం నేతలతో మాట్లాడతారు.
మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్ల నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు బేతంచర్ల బస్టాండ్ సర్కిల్ లో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి కోలుములెపల్లి చేరుకొని.. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.
సంబంధిత వార్తలు