దొర్నిపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి 11వ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఆయన ఈ రోజు ఉదయం 8 గంటలకు దొర్నిపాడు నుంచి పాదయాత్రను ఆరంభించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన బనగానపల్లె నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి.
ఆపై ఉయ్యాలవాడ క్రాస్ రోడ్ మీదుగా భీమునిపాడు వద్దకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత భోజన విరామం తీసుకుని తర్వాత యాత్ర కొనసాగిస్తారు. పెరా బిల్డింగ్స్, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల బస్టాండ్ సెంటర్ మీదుగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వయా కర్రా సుబ్బారెడ్డి విగ్రహాం వద్దకు చేరుకోగానే పాదయాత్ర ముగుస్తుంది. అక్కడే ఆయన రాత్రి బస చేస్తారు.
సంబంధిత వార్తలు