నేడు జగన్ రోడ్షో సాగేదిలా..
సాక్షి బృందం, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పదో రోజు రోడ్షోను పట్టణంలోని సాయిబాబానగర్ ఆర్చి సెంటర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, అభ్యర్థి శిల్పామోహన్రెడ్డి గురువారం తెలిపారు. అక్కడి నుంచి దేవనగర్ క్రాస్రోడ్, వెంకటేశ్వర స్టోర్, పార్కురోడ్ సెంటర్, నాగులకట్ట సెంటర్, దేవనగర్ సెంటర్, మసీదుసెంటర్, బేతెలు చర్చి సెంటర్ వరకు రోడ్షో కొనసాగుతుందని వెల్లడించారు.