జగన్కు దీవెనలు
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ రాజాంలోని బాలాజీ టెంపుల్ ట్రస్ట్కు చెందిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ అర్చకులు జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించారు. మంగళవారం జిల్లాలో రాజాం ని యోజకవర్గం అంతకాపల్లి క్రాస్ గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఈ మేరకు అర్చకులు జగన్ను కలసి దీవెనలు అందజేశారు.
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గత ఏడాది నవంబరు 6వ తేదీ న వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారని, నేటికి 312వ రోజుకు పాదయాత్ర చేరుకుందన్నారు. ఈ యాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుం డా ఆ వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదం ఉంటుందన్నారు. జగన్ను ఆశీర్వదించిన వారిలో బీకేవీ రామానుజాచార్యులు, కె.పవన్కుమార్ ఆచార్యులు, కె.పవన్కుమార్ తదితరులు ఉన్నారు.
సంబంధిత వార్తలు