వైఎస్సార్‌ జిల్లాలో జగన్‌ మూడు రోజుల పర్యటన

YS Jagan Three days Tour In YSR District - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సుధీర్ఘ పాదయాత్రను ముగించుకున్న ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం కాలినడకన సామాన్య భక్తుడిలా తిరుమల చేరిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం శ్రీవారి దర్శనం పూర్తిచేసుకున్నారు. ఈ రోజు రాత్రి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం 9 గంటలకు కడపలోని అమీన్‌పీర్‌ దర్గాను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకొని అక్కడి సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం నేరుగా ఇడుపులపాయకు చేరుకొని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top