అన్న వస్తున్నాడు అంటూ జగన్‌కు జేజేలు

YS Jagan receives huge response in PrajaSankalpaYatra - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, కర్నూలు :  ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, టీడీపీ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. రాజన్న తనయుడు అడుగడుగునా జన నీరాజనాలు అందుకుంటున్నారు. తమ గ్రామం నుంచి పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ‘అన్న వస్తున్నాడు’ అంటూ జగన్‌కు జనం జేజేలు పలుకుతున్నారు. ప్రజా వెల్లువతో యాత్ర నెమ్మదిగా సాగుతోంది. ఐదు కిలోమీటర్ల దూరానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది.

యాత్రలో భాగంగా కంపమెళ్లమెట్ట చేసుకున్న వైఎస్‌ జగన్‌నకు  గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను కలిసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు. అనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకున్న ఆయన శనివారం మధ్యాహ్నం బనగానపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించారు.  అక్కడ నుంచి  ఉయ్యాలవాడ క్రాస్‌ రోడ్‌ ,  భీమునిపాడు , పెరా బిల్డింగ్స్‌, కోవెలకుంట్ల బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా ..... కర్రా సుబ్బారెడ్డి విగ్రహాం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

ఈరోజు ఉదయం దొర్నిపాడు నుంచి 11వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించిన వైఎస్‌ జగన్‌ దారి పొడవునా ఎదురైన ప్రతి ఒక్కర్నీ పలకరించుకుంటూ  ముందుకెళ్తున్నారు. దొర్నిపాడు వద్ద పెద్ద ఎత్తున మహిళా వ్యవసాయ కూలీలు ఆయనను కలిశారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి బాధలు విన్న ప్రతిపక్షనేత ....రుణమాఫీ, పిల్లల చదువులపై భరోసా కల్పించారు. అలాగే దొర్నిపాడు శివారులో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top