జిల్లాలో నేడు ఐదో రోజు పాదయాత్ర

YS Jagan Public Meeting In Kotavuratla Visakhapatnam - Sakshi

కోటవురట్లలో సాయంత్రం 3 గంటలకు బహిరంగసభ

విజయవంతం చేయాలని తలశిల రఘురాం పిలుపు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 241వ రోజు సోమవారం నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్‌ సీపీ ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం వెల్లడించారు. జోగినాథునిపాలెం శివారు కెన్విన్‌ స్కూల్‌ సమీపంలో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి సోమవారం ఉదయం 7.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్‌ మీదుగా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. కోటవురట్ల మండలం యండపల్లి, జల్లూరు, పాతతంగేడు, తంగేడు క్రాస్‌ మీదుగా కోటవురట్ల చేరుకుంటుందన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారన్నారు. అనంతరం కోటవురట్ల మీదుగా కైలాసపట్నం చేరుకుని రాత్రికి బసకి ఆగుతారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top