జగన్‌ బాబు వస్తే..పింఛన్‌ రెండు వేలు వస్తుంది

YS Jagan Promises Rs 2,000 Old Age pension - Sakshi

‘బాబూ నాన్న పేరు నిలబెట్టాలి. ప్రజలంతా నీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాముడిలాంటి పాలన అందించు’ అని ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని ఆనందపురానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలు ఆశీర్వదించారు. నాన్న హయాంలో నాకు  పింఛన్‌ వచ్చింది. ప్రస్తుతం నాలాంటోళ్లు చాలా మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎండలో ఎంతో కష్టపడి నడుస్తున్నావు. నీ కష్టం ఊరికే పోదు. వచ్చే ఎలక్షన్లో నువ్వు కచ్చితంగా గెలుస్తావు. మంచిగా పాలించు నాయనా.. అంటూ చెప్పారు. మా ఊర్లోనే జగన్‌ బాబు రాత్రి బస చేశారు. ఉదయాన్నే బాబు దగ్గరకు వెళ్లి కలిశాను. జగన్‌ బాబు అధికారంలోకి వస్తే మాకు రెండు వేల పింఛన్‌ వస్తుంది అంటూ వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top