227వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Ys Jagan PrajaSankalpaYatra 227th Day Schedule Released - Sakshi

సాక్షి, పిఠాపురం (తూర్పుగోదావరి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 227వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత గురువారం ఉదయం గొల్లప్రోలు మండల శివారు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చెందుర్తి క్రాస్‌ వరకు పాదయాత్రను కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ​

ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 226వ రోజు ముగిసింది. బుధవారం ఉదయం పిఠాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గొల్లప్రోలు, తాటిపత్రి క్రాస్‌ వరకు నేటి పాదయాత్ర కొనసాగింది. నేటి ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ 7.3 కిలోమీటర్లు నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 2643.2 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top