తైవాన్‌ జామను బహూకరించిన చెల్లెమ్మ

YS Jagan Praja Sankalpa Yatra in Vizianagaram - Sakshi

విజయనగరం : వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సమస్యలను గుర్తించేందుకు చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర బొబ్బిలి నియోజకవర్గం నుంచి సాలూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ చెల్లెమ్మ జగన్‌ అన్నకు తైవాన్‌ జామకాయలను బహూకరించింది. కొట్టక్కి ముందు ఉన్న జామ తోటలో పని చేస్తున్న రుద్రరాజు రామలక్ష్మి పాదయాత్ర వద్దకు కూలీలతో వచ్చి పెద్ద సైజున్న జామ కాయలను బహుకరించింది. ఈ జామ కాయలను తీసుకున్న జగన్‌ ఆమెను అభినందించారు. దీని సాగు వివరాలను తెలుసుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top