జగన్ను చూసి మురిసిపోయి...
సాక్షి, విశాఖపట్నం: ఆ ఊళ్లో అమ్మవారి పండుగ..మొక్కులు తీర్చుకుని అమ్మవార్ని దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తింది. ఇదే సమయంలో జననేత వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకుని వారంతా జగనన్న కోసం మండుటెండలో ఎదురు చూశారు. రాజన్నబిడ్డను చూడగానే వారంతా పరవశించిపోయారు.అదిగదిగో జగనన్నా.. అంటూ యువతీయువకులు కేరింతలు కొట్టారు. ఆత్మీయ స్పర్శ కోసం పోటీపడ్డారు. వీరందిరి ఉత్సాహం చూసిన జననేత వారిలో ఒకరిగా కలిసిపోయారు. సెల్ఫీలు తీసుకున్నారు. షేక్హ్యాండ్ ఇచ్చారు. ఆత్మీయ నేతతో మాట్లాడి జనం మురిసిపోయారు. తమ గుండెలోతుల్లో బాధను చెప్పుకున్నారు. ఈ అరుదైన ఘట్టం ప్రజాసంకల్పయాత్రలో కోటవురట్ల మండలం గొట్టివాడలో చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం గొట్టివాడ గ్రామదేవత పరదేశమ్మ అమ్మవారి పండుగ మంగళవారం జరుపుకున్నారు. భారీగా చేరుకున్న భక్తులు జగనన్నను వస్తున్నాడని తెలుసుకుని ఘనంగా స్వాగతం పలికారు. పరదేశమ్మ అమ్మవారి ఆశీర్వాదం మీకెప్పుడూ ఉంటుందని..మీరు తప్పక సీఎం అవుతారని..
మా కష్టాలన్నీ తీరుస్తారంటూ ఆనందం వ్యక్తం చేశారు.